Sunday, December 23, 2012

ఇంగ్లీషు నేర్చుకొనే శాస్ర్తియ పద్ధతి.... తొలి చదువులు -24

22-12-2012

‘‘పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు, పట్టనేనే బిగియ పట్టవలె...’’ అంటాడు మంది కవి వేమన. ఎవరికి అయినా తల్లి భాష ఏ ప్రయత్నమూ లేకుండా అలవోకగా వచ్చేస్తుంది. దీన్ని పనిగట్టు కొని ఎవరూ నేర్పించాల్సిన పని లేదు. సొంత భాష తప్పించి ఇతర ఏ భాషను నేర్చు కోవాలన్నా దాన్ని అది పనిగా నేర్చు కొని తీరాలసిందే తప్ప వేరే దారి ఉండదు. తన భాష కాని భాషను నేర్చు కోవాలి అంటే అది రెండు పద్ధతుల ద్వారా మట్టుకే వీలవుతుంది. మొదటి పద్ధతి ఏ భాషను నేర్చు కోతలచుకున్నారో ఆ భాషను మాట్లాడే వారి మధ్య ఉండి నేర్చు కోవటం. మచ్చుకు తమిళనాడులో ఉండి తమిళం నేర్చు కోవటం. అది చాలా సుళువు పద్ధతి. రెండో పద్ధతి తను ఉన్నచోటులోనే నేర్చు కోవాల్సిన భాషను సాధన చేయటం. అంటే మనం మన ఊరి లోనే ఉండి ఇంగ్లీషునో, హిందీనో నేర్చు కోటానికి ప్రయత్నం చేయటం. ఇది సాపేక్షంగా కొంత కష్టం అయిన పని. దీనికి ఎక్కువ సాధన చెయ్యాలి. సమయం కూడా ఎక్కువ పడుతుంది. అయితే ఈ రెండు పద్ధతుల్లోనూ ‘తెలిసిన’ భాష ద్వారా రెండో భాషను నేర్చు కోవాలి. తమిళనాడులో ఉన్నా తమిళానికి తెలుగు లింకు తెలియ చెప్పకుండా ఎన్నాళ్లు ఉన్నా తమిళం రాదు. మహా అయితే హావ భావాలు ద్వారా పొందే కొన్ని మాటలు ఒంట పట్టవచ్చు. మచ్చుకు ‘సాపాటియా?’ అని ఒక తమిళుడు నోటితో అంటూ పనిలో పనిగా నోటి దగ్గరకు తెచ్చే ఒంటి భాషను (యాక్షన్) ఉపయోగిస్తారు. అప్పుడు ‘సాపాటియా’ అనే పలుకుకి ‘తిండి తిన్నావా?’ అని తెల్లమవుతుంది. ఇక్కడ యాక్షను కూడా ఒక లింకే. అంటే మనం తమిళం నేర్చు కోవాలి అంటే అటు తమిళమూ, ఇటు తెలుగూ రెండూ తెలిసిన వారు ఉండాలి. ఇంగ్లీషు నేర్చు కోవాలి అను కొనే వారు ఓవరు అయినా దాన్ని తమ సొంత భాష ద్వారా నేర్చు కొని తీరాలిసిందే.


చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా అవసరాన్ని బట్టి ఎవరు ఎన్ని భాషలు అయినా నేర్చు కోవచ్చు. అయితే నేర్చు కునే చురుకుదనం పిల్లల్లో చాలా ఎక్కువ. అందువల్ల పిల్లలు చాలా వేగంగా నేర్చుకుంటారు. కానీ సౌలభ్యం మాత్రం పెద్ద పిల్లలకే ఎక్కువ. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఇతర భాష నేర్చు కోటానికి ముందు తమ సొంత భాష పూర్తిగా వచ్చి ఉంటుంది. దాని ద్వారా రెండో భాషను నేర్చు కుంటారు. కానీ చిన్న పిల్లల్లో వాళ్ళ సొంత భాషే ఇంకా పూర్తిగా ఎదిగి ఉండదు.

నేర్చు కొనే రెండో భాష ఏది అయినా, దాన్ని నేర్చు కోవటంలో ఒక వరుస, తీరూ ఉంటుంది. అంటే భాషను అంచెలంచెలుగా నేర్చు కోవాలి. అందులో మొదటిది నేర్చు కొనే భాషను ఇతరులు మాట్లాడేటప్పుడు దాన్ని కొంత కాలం పాటు బాగా వినాలి. తరువాత కొద్ది కొద్దిగా మాట్లాడటం మొదలు పెట్టాలి. ఆపయిన చదవటం, రాయటం నేర్చు కోవాలి.

ఏ భాష అయినా నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి దాని మీద పూర్తి పాండిత్యం రావటం అనేది మొత్తం నాలుగు అంచెలుగా జరుగుతుంది. అంటే పిల్లలు రెండో భాషను నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి పూర్తిగా దానిమీద పట్టురావడానికి ఒక దశ తరువాత మరొక దశను పూర్తిచేసుకుంటూ పోతే తప్ప నేర్చుకోవాల్సిన భాష పూర్తి కాదు.


1. పరిచయ దశ: ఈ దశ కనీసం ఒక ఏడాది పాటు ఉంటుంది. ఈ దశను వినే దశ అని కూడా అంటారు. భాష నేర్చు కునే పిల్లలు, నేర్చు కోవాల్సిన భాషలో మాటల్ని వినాలి. పదాలు పలికేటప్పుడు మాట్లాడే వారి ముఖ కవళికలు, ఒంటి కదలికలు ఎలా ఉంటున్నాయో గమనిస్తారు. అంతే కాకుండా విన్న పరాయి పదాలకు తన సొంత భాషలో అర్థాలు తెలుసు కోవాలి. ఈ దశలో పిల్లలు భాషను మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడమని ఒత్తిడి కూడా చేయ కూడదు. బిడ్డ భాషను నేర్చు కొంటున్నాడే కాని ఆ భాషను మాట్లాడే వాడు కాదని గుర్తుంచుకోవాలి. ఈ దశలో బిడ్డకు నేర్చు కోబోయే భాష మీద అవగాహన వస్తుందే తప్ప తిరిగి దాన్ని చెప్ప లేక పోవచ్చు. వాళ్ళకయి వాళ్ళు మాట్లాడితే అది వేరే సంగతి.

2. తేలిక పదాల దశ: ఈ దశలో నేర్చుకున్న పరాయి మాటలను పరిమితంగా పలకటము, సొంత భాషతో కలిపి మాట్లాడే దశ. బిడ్డలకు పదాలతో అవగాహన ఉంటుందే తప్ప పూర్తిగా భాష రాదని గుర్తుంచుకోవాలి. భాష లోని విడి పదాలను అర్థవంతంగా ఉపయోగిస్తారు. బదులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తొలుత ''Yes, No, Come, Go  లాంటి ఒంటి పలుకులతో తరువాత పొట్టిగా  ఫరాయి పలుకులను వాడ గలిగే స్థితికి  (I need, I am going, you come) ఎదుగుతారు. ఈ దశ పూర్తి కావటానికి రెండేళ్లు పడుతుంది.



3. మాట్లాడే దశ: ఈ దశలో పిల్లలు నేర్చుకొన్న భాషను సాధారణ మాట భాషగా వాడగల స్థాయికి ఎదుగుతారు. మాట్లాడే భాషలో తప్పులు చాలా తక్కువగా ఉంటాయి. మాట్లాడటానికి జంకాల్సిన అవసరం ఉండదు. పర్యాయ పదాలు నేర్చు కొని ఉంటారు కాబట్టి పదాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. చిక్కు వాక్యాలు మాట్లాడటం ఈ దశ లోనే వస్తుంది. ఈ దశ పూర్తి కావటానికి బిడ్డకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల మీద, సంస్థ మీద, చుట్టూ ఉన్న భాషా పరిసరాలను బట్టి అంటే ఆంగ్లం మాట్లాడే సహచరులు, వారితో వ్యవహరించే తీరు, సమయం మీద ఆధార పడి రెండేళ్ళ నుండి అయిదు ఏళ్ళ వరకు పట్టవచ్చు.



4. సాహిత్య దశ: ఈ దశలో దాదాపు తన సొంత భాష మీద ఎంత పట్టు ఉంటుందో అంతే పట్టు ఇంగ్లీషు మీద కూడా వస్తుంది. గ్రామరు మీద ఆధిక్యత సంపాదిస్తారు. ఇంగ్లీషులో ధారాళంగా, వేగంగా, తడబాటు లేకుండా మాట్లాడగలరు, ఇంగ్లీషులో వాదోప వాదాలు చేయగలరు. ఇంగ్లీషులో అన్నీ సాహిత్య ప్రక్రియలు చేపట్ట గలరు. తన సొంత భాషలో ప్రావీణ్యం లేని వారు ఈ దశకు చేరు కోలేరు.


విద్యకు సంబంధించిన పిల్లలకు కొత్త భాషను నేర్పించటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. బిడ్డ సొంత భాషను అలాగే కొనసాగిస్తూ నేర్చు కోవాల్సిన భాషను అదనంగా చేర్చటం ‘అదనపు’ నమూనా పద్ధతి. అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదివే పిల్లలకు మూడో తరగతిలో ఇంగ్లీషు నేర్పటం మొదలు పెట్టినట్టు. అలా కాకుండా బిడ్డ సొంత భాషలో చదవటానికి ఏ కోశానా అవకాశం లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో రెండో భాషను నేర్పించేది ‘ప్రత్యామ్నాయ’ నమూనా పద్ధతి. సాధారణంగా ఇలాంటి పద్ధతి మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్లినపుడు అక్కడ విధిలేక పాటించే పద్ధతి. రెండో భాషను బాగా నేర్చు కోవటానికి మంచి పద్ధతీ, శాస్ర్తియం అయినది అదనపు నమూనా పద్ధతి. మంచి ఇంగ్లీషు నేర్చు కోవాలంటే పద్ధతి ప్రకారం శాస్ర్తియంగా నేర్చు కోవాలి. ప్రపంచంలో ఎవరు ఇంగ్లీషు నేర్చు కున్నా అలాగే నేర్చుకుంటారు. ఇంగ్లీషు మీడియంలో చదివే మన తెలుగు పిల్లలు తప్ప

No comments:

Post a Comment