Wednesday, February 9, 2011

తెలుగు అచ్చరాలలో సగం మనవి కావు



మన తెలుగు అచ్చరాలలో సగం మనవి కావు! అవును ఇది నిప్పులాంటి నిజం. తెలుగు 'అక్షరాలు' 54 అని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పించారు. మనకే కాదు మన తల్లి తండ్రులకు, తాతలకు, ముత్తాతలకు, వారి ముత్తాలకు తరతరాలుగా అలాగే నేర్పించారు. నేర్పించే అయ్యోర్లకు కూడా తెలియకుండానే అలా అని మనకు నేర్పించారు. మన నుడి గురించి మనకు తెలియనంతగా, తెలుసుకోలేని అంత చాక చక్యంగా కుట్ర చేసి 29 అచ్చరాలుగా ఉన్న కమ్మనయిన తెలుగు పలుకులకు 26 సంస్కురతపు "అక్షరాలు" కలిపి మొత్తం 56 'అక్షరాలు'గా చేసి దానికి 'ఆంధ్రము' అని పేరు పెట్టినారు. దాని వల్ల తేనెలు ఊరే తెలుగు తనం పోయి తాటి బెల్లం కలిపి చేసిన వగరులా తెలుగు తయారు అయ్యింది. 
తెలుగు గురించి తెలుగు వారికి తెలియకుడా "దాపిరికం (secrete) గా పరాయి నుడి నుంచి అచ్చరాల చొరబాటు ఎలా  జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు జరిపారు? నుడి చొరబాటు వల్ల తెలుగు జాతి ఏమి పోగొట్టుకుంది? మన నుడి, మన పలుకు, మన నుడి ఆచారాలు ఏమయాయి?  ఎక్కడ పాతి పెట్టారు? అనేవి తెల్లం కావాలంటే మనం చిన్నపుడు నేర్చుకున్న తప్పుడు తెలుగు ''వర్ణమాల"తో మొదలు పెట్టాలి. తెలుగు పేరుతో ఇప్పుడు అమలులో ఉండే "అక్షర మాల" పట్టిక ఇది;

అచ్చులు (16 ): 
అ  ఆ     ఇ  ఈ      ఉ  ఊ     ఋ       ఎ  ఏ  ఐ      ఒ   ఓ        అం    అః
హల్లులు ( 36 ) :  
క     ఖ     గ     ఘ      
చ     ఛ     జ     ఝ     
ట     ఠ     డ     ఢ      ణ
త     థ     డ     ధ      
ప     ఫ     బ     భ       
య    ర     ల    వ      శ       ష      స      హ     ళ     క్ష     ఱ  

16  అచ్చులు, 36 హల్లులు కలిపి మొత్తం 52 అక్షరాలు తెలుగు "వర్ణ మాల"గా  మనం నేర్చుకుంటున్నాము. నిజానికి ఇది అసలయిన తెలుగు పలుకుకుల పట్టీ కాదు. ఇందులో తెలుగు "పలుకులు" + సంసుక్రుతపు "అక్షరాలు" కలిసి ఉన్నాయి. గమనించండి.

అచ్చులు (16 ): 

అ  ఆ     ఇ  ఈ      ఉ  ఊ     ఋ       ఎ  ఏ        ఒ   ఓ        అం    అః
హల్లులు ( 36 ) :  
క     ఖ     గ     ఘ      
చ     ఛ     జ     ఝ     
ట     ఠ     డ     ఢ      ణ
త     థ     డ     ధ      
ప     ఫ     బ     భ       
య    ర     ల    వ      శ       ష      స           ళ     క్ష     ఱ  
ఎరుపు రంగులో ఉన్నా"అక్షరాలు అంటే అచ్చులలో ఐ, ఔ , ఋ,  కః మన తెలుగు పలుకులు కావు. అలాగే  హల్లులలో క చ ట త ప లు, గ జ డ ద బ లు  న మ లు మాత్రమే తెలుగు పలుకులు. మిగిలిన ఖ ఛ  ఠ థ ఫ లు ఘ ఝ ఢ ధ భ లు    ణ లు, శ ష హ క్ష అనే "అక్షరాలు" తెలుగు పలుకులు కావు. తెలుగులో కలితీ అయిన "అక్షరాలు
మరయితే అసలు తెలుగు పలుకులు ఏమిటి అని తరచి చూస్తే, తేట తెలుగు పలుకుల పట్టిక ఇది:  .

అచ్చులు (10) :
అ    ఆ     
ఇ    ఈ  
ఉ    ఊ     
ఎ     ఏ      
ఒ     ఓ
అల్లులు (19) :    
             
     జ       
ట             
త     ద       
ప            
య    ర     ల    వ      స       ళ       ఱ
తెలుగు పలుకులలో కేవలం 10 అచ్చులు, 19 అల్లులు మాత్రమే ఉంటాయి. అసలు తెలుగు పలుకులు చాల తేలికాగా ఉంటాయి. అలవోకుగా పలకటానికి అనుకూలంగా ఉంటాయి. వీటిలో ఒత్తుతనం, అదిమి పలికే అవసరం ఉండదు. అందుకే తెలుగు నుడి మాటాడుతూ ఉంటే తేలికగా, కమ్మగా ఉంటుంది. సెల యేటి గల గలలా వినసొంపుగా ఉంటుంది. కాబట్టే తేట తెలుగు తేనే తెలుగు అయ్యింది. అలాంటి తెలుగు పలుకులలో సంసుక్రుతపు  "అక్షరాలు" చేరటం వల్ల తెలుగు తన సొబగులు పోగొట్టుకొని 'ఘోష'లా తయారు అయింది. దీని వల్ల తెలుగు నుడి ఏమి పోగొట్టుకున్నది  అన్నది చూస్తే,
  • తన అసలు తనాన్ని పోగొట్టుకుంది.
  • నిండా కలితీ నుడిగా తాయారు అయినది
  • లేతదనము పోగొట్టుకొని కరుకుగా తయారు అయినది.
  • పాడి (Standard) నుడిగా ఎదగ లేక పోయింది.
  • తక్కువ పలుకులు (29) ఉండటం అనేది 'లెక్కిణి' (computer) నుడిగా వాడటానికి చాల అనుకూలం అయినది. ఒక అంచనాను బట్టి ఇంగిలీసు తదితర పడమటి (అయిరోపా) నుడుల తరువాత  తూరుపున 'లెక్కిణి'నికి అనువయిన నుడిగా ఉండేది. "భారత దేశం"లో లెక్కిణికి కుదరగలిగే ఒకే ఒక్క నుడిగా ఎదిగేది. ఇప్పుడు ఆ చోటులో తమిళ  నుడి ఉంది.
  •  29 తేట తెలుగు "పలుకుల"కు 23 పరాయి నుడి అక్షరాలు కలిపి 54 "అక్షరాల"ను చేయటం వల్ల చిక్కు నుడిగా మారినది.  
తెలుగు నుడి పాలలో మురికి నీళ్ళు కలిపి కలితీ చేయాలిసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? దానివల్ల మనం ఏమి పోగుట్టుకున్నాం? అనే సంగతులను తెలుగు వారు అందరు తెలుసుకోవాలి. రాబోయే తపాలలలో వాటి గురించి చూద్దాం.